మహిళ సాధికారత బిఆర్ఎస్ తోనే సాధ్యం – కార్పొరేటర్  మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట డ్వాక్రా సంఘాలతో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి  సమావేశం నిర్వహించారు.

వేముకుంట డ్వాక్రా సంఘాలతో మాట్లాడుతున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

ఈ సందర్భంగా  మంజుల రఘునాథ్ రెడ్డి  పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  పేద మహిళలకు ఇస్తున్న కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ , ఒంటరి మహిళకు పెన్సన్ పథకాలు గురించి వివరించారు.  30 తేదీన మీ అమూల్యమైన ఓటును మీ కుటుంబ సభ్యులతో కారు గుర్తుకు వేయించి  శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యె గా అరెకపూడి గాంధీని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు.

మహిళా డ్వాక్రా సంఘాలకు ఎమ్మెల్యేగా గాంధీని గెలిపించాలని కోరుతూ పార్టీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు అందించిన మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here