అండగా ఉండండి.. గెలిచిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తా

  • అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్, అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ బిజెపికి మద్దతుగా  సమావేశం నిర్వహించింది.  ఈ సమావేశంలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి  భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు.

అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

అసోసియేషన్  పలు సమస్యలు తమ దృష్టికి తీసుకురాగా గెలిచిన వెంటనే పరిష్కరించి తీరుతామని,  ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నెల నవంబర్ 30 వ తారీకున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించాలని కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here