నమస్తే శేరిలింగంపల్లి: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ ప్రారంభోత్సవంలో జపనీయులు సూర్యనమస్కారాలు చేశారంటూ వైరల్గా మారిన వీడియోలో నిజం లేదని తేలింది. జాతీయ జెండా రంగులతో వస్త్రాలను ధరించి మంత్రసహితంగా సూర్యనమస్కారాలు చేయడం ద్వారా భారతదేశానికి అపూర్వ గౌరవం లభించిందంటూ రెండు రోజులుగా విపరీతంగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ వీడియో 2015లో మంగోలియా దేశంలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఒలంపిక్స్లో సూర్యనమస్కారాలు చేసినా, చేయకున్నాభారతదేశ సంస్కతిలో భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదనే విషయం మాత్రం నూటికి నూరుపాళ్లు నిజం. 3:14 సెకన్ల నిడివి గల ఈ వీడియోను మీరూ చూడండి.