నెహ్రూనగర్‌లో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు… చింతకింది రవీందర్ గౌడ్ ఆద్వర్యంలో ఘటం సమర్పణ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ బస్తీలో ఆషాడ మాస బోనాల మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. టిఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నెహ్రూనగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి కల్లు ఘటం సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు డప్పు దరువుల మధ్య ఘటం ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ఆశీస్సులతో త్వరలోనే కరోనా మహమ్మారి పూర్తిగా కనుమరుగు అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చింతకింది డాకయ్య గౌడ్, మహేందర్ గౌడ్, స్థానిక నాయకులు, బస్తీవాసులు, ఇతర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘటం ఊరేగింపులో నిర్వాహకులు చింతకింది డాకయ్య గౌడ్, మహేందర్ గౌడ్, రవిందర్ గౌడ్ తదితరులు
ఉత్సవాల్లో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్, తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డిలను సన్మానిస్తున్న చింతకింది మహేందర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here