ఆకాశమే హద్దుగా అగ్రస్థానం దిశగా అడుగులేయాలి : చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి నగర్ లో శ్రీనిధి స్కూల్ ఆధ్వర్యంలో “హంగామా మస్తి – ఉమెన్స్ డే” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

హంగామా మస్తి – ఉమెన్స్ డే కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సత్కరిస్తున్న శ్రీనిధి స్కూల్ యాజమాన్యం

స్కూల్ యజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరై మాట్లాడారు. “కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేశు మాత.. ఇలా సమస్తం నీవే. ఓ మాతృ మూర్తి..అంటూ ప్రతి దానిలో సగభాగం ఆడది అనే స్థాయి నుంచి ప్రతి దాంట్లో మొదటి భాగం ఆడది అనే స్థాయికి ఎదగాలని.. ఈ సందర్భంగా మహిళలందరికి మహిళా దినోత్సవం సందర్భంగా మీ కిదే మా వందనం!! అని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here