అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా అరుణోదయ కళా సమితి లతా మంజూష, మోహన్ రెడ్డి శిష్య బృందం కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఆధ్యంతం అలరించాయి.

భరతనాట్య ప్రదర్శనలో కళాకారులు

వినాయక స్తుతి, అలరిపు, జతిస్వరం, నమశ్శివాయతేయ్ , అష్టలక్ష్మి స్తోత్రం, సరస్వతి వందనం, బ్రహ్మమొక్కటే, రుక్మిణి ప్రవేశ దరువు, తిల్లాన, ఆదియోగి, గరుడగమనా, శ్రీరఘువరా, సరయమయప్ప , ముద్దుగారేయ్ యశోద, నమశ్శివాయతేయ్ , గరుడగమనా రారా మొదలైన అంశాలను ప్రదర్శించారు. ప్రముఖ నాట్య గురువర్యులు సంజయ్ కుమార్ జోషి, రవి కూచిపూడి, ముఖ్య అతిధులుగా విచ్చేసి కళాకారులను ప్రణతి, అమృత, ధార్మిక, వినితి, కార్తీక, రక్షణ, మాలిన్య పూర్ణిమ వర్ష, నవ్య, సౌదామినిని సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here