కొనసాగుతున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గాయత్రీ స్కూల్ అఫ్ డాన్స్ గురువు డాక్టర్ జ్యోతి శేఖర్ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.

గణేశా పంచరత్న, జయ జయ దుర్గే, దశావతర శబ్దం, అంత రామమయం, మండూకశబ్దం , రామకోదండ రామ, చక్కని తల్లికి, అలరులు కురియగా మొదలైన అంశాలను కుమారి గాయత్రీ శేఖర్, ఈషా, షణ్ముఖ సహస్ర, వైష్ణవి, నాగమణి, మీనాక్షి, దీప్తి, అన్విత పావని, సిరి ఆరాధ్య, కీర్తన, అక్షయ, రిధి, రాధా, సాన్విక, కిన్నెరా మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here