ఘనంగా నృత్యోత్సవాలు ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో మూడు రోజుల వసంతోత్సవ నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ కథక్ కళాకారిణి అర్చన మిషర్, ఒడిసి కళాకారిణి సస్మితా మిశ్ర బృందం జుగల్బందీ ప్రదర్శన రెండుగంటల పాటు ఆద్యతం అలరించింది. ప్రదర్శనలో భాగంగా గణేష్ వందన, పంచదేవ స్తుతి, సర్గం, బసంత పల్లవి, గురు వందన, రాధా కృష్ణ, రహ భైరవి, స్థాయీ , నృత్య సంగీత్, భారత్ అనోఖా రాజ్, జుగల్బందీ అంశాలను ప్రదర్శించి మెప్పించారు. వారిలో శ్రేయ సుమన్, శుభశ్రీ , అనిష్క, ఇక్షిత, ఆకాంక్ష, తానిషా, కామాక్షి, జ్యోతిక, అక్షిత, అన్విత, నీసా, నిధిప ప్రదర్శించారు.

నృత్య ప్రదర్శనలో కళాకారుల బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here