లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద.. ముంపు సమస్య తొలిగినట్లే

  • రూ. 4కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రూ. 4 కోట్ల అంచనావ్యయంతో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పనులలో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. కల్వర్ట్ నిర్మాణం పై అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటామని హామీ ఇచ్చారు.

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీటి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గౌడ్, జనార్దన్ రెడ్డి, పద్మారావు, గోపాల్ యాదవ్, గడ్డం రవి యాదవ్, కోయ్యడ లక్ష్మణ్ యాదవ్, అజీమ్, సుభాష్ రాథోడ్, నటరాజ్, రవి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here