ఎల్జీఎస్ బాబామ్మకు సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి : సైబరాబాద్ లో ఎల్ జీఎస్ (లాస్ట్ గ్రేడ్ సర్వీస్) గా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందిన డి. బాబమ్మను సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ లో సీపీ స్టీఫెన్ రవీంద్ర సన్మానించారు. ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేసిన బాబామ్మ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఫండ్ కింద రూ. 30 వేల చెక్ ను బాబామ్మ కు అందచేశారు. అలాగే పొదుపు మొత్తము రూ. 2 లక్షల 60 వేలను తన బ్యాంక్ ఖాతా లో జమ చేశామని సీపీ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం ట్రెజరర్ జి.మల్లేశం పాల్గొన్నారు.

లాస్ట్ గ్రేడ్ సర్వీస్ గా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందిన బాబమ్మను సన్మానిస్తున్న సీపీ స్టీఫెన్ రవీంద్ర
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here