నమస్తే శేరిలింగంపల్లి: దేశం గర్వించదగ్గ అభివృద్ధి జరగాలంటే బిజెపితో సాధ్యమని, తనను గెలిపిస్తే ఆ దిశగా కృషి చేస్తానని ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0015.jpg)
గచ్చిబౌలి డివిజన్ , లక్ష్మి విహార్ ఫేజ్ 2 అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారు పలు సమస్యలు దృష్టికి ఆయన దృష్టికి తీసుకురాగా గెలిచిన వెంటనే పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/IMG-20231125-WA0017-scaled.jpg)
ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, 30వ తారీకున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించాలని కోరారు.