బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ తో యోగానంద్ సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి, లద్దాఖ్ – జమ్మూకశ్మీర్, తెలంగాణ రాష్ట్రాల బీజేవైఎం విభాగాల ఇంచార్జి తరుణ్ ఛుగ్ ను బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి యోగానంద్ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలోపేతం, దేశ నిర్మాణం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపైన తరుణ్ ఛుగ్ తో యోగానంద్ విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు విశేష ప్రజాదరణ వస్తోందని చెప్పారు. ఈ పరిణామాలు తెలంగాణలో బిజెపి అభివృద్ధికి దోహదపడగలవని తరుణ్ ఆశాభావం వ్యక్తం చేశారన్నారు. జాతి నిర్మాణంతో పలు ముడిపడిన అంశాలపై తరుణ్ తో చర్చించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తమ ఆత్మీయ కలయికకు గుర్తుగా భారతీయ యువతరానికి స్ఫూర్తిదాత వివేకానంద చిత్రంతో కూడిన జ్ఞాపికను తరుణ్ ఛుగ్ తనకు ప్రధానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here