నియోజకవర్గంలో మాకు గుర్తింపు లేదు – శేరిలింగంపల్లి ఉద్యమకారుల ఆవేదన

నమస్తే శేరిలింగంపల్లి:ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర కీలకమని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఉద్యమకారులను‌ ఏకతాటిపైకి తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గా లో నివాసముండే అశోక్ ముదిరాజ్ ను తోటి ఉద్యమకారులు కలిశారు. చాలా రోజుల తర్వాత కలవడంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, ఉద్యమకారులందరూ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని అన్నారు. ఉద్యమంలో పాలుపంచుకున్నట్లే బంగారు తెలంగాణ సాధనలోనూ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్,షేక్ జమీర్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

అశోక్ ముదిరాజ్ ను కలిసిన నియోజకవర్గం ఉద్యమకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here