కరోనా మృతుల కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకోండి: రోహిత్ ముదిరాజ్

నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ మహమ్మారితో మరణించిన వారి కుటుంబ సభ్యులు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా కోసం దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో, ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ల లో‌ దరఖాస్తు చేసుకోవాలని టీఆర్ఎస్ హఫీజ్ పేట్ యువజన‌ విభాగం అధ్యక్షుడు జి. రోహిత్ ముదిరాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేసిందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి ఈ పరిహారం అందనున్నట్లు చెప్పారు. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆన్ లైన్ లో కింది పత్రాలతో దరఖాస్తు చేయాలని సూచించారు.

జతపరచాల్సిన పత్రాలు…
1. మరణించిన వారి ఆధార్ కార్డు
2. మరణ ధృవీకరణ‌ పత్రం
3. దరఖాస్తుదారుని ఆధార్ కార్డు
4. కోవిడ్ నిర్ధారణ పత్రము
5. ఫోన్ నెంబర్
6. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ (IFSCకోడ్ నెంబర్)

మీ దగ్గరలో ఉన్న ఈ సేవ కేంద్రం లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అర్హులైన వారికి 30 రోజుల్లోపు పరిహారం తమ తమ బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారని తెలిపారు.

టీఆర్ఎస్ హఫీజ్ పేట్ యువజన‌ విభాగం అధ్యక్షుడు జి. రోహిత్ ముదిరాజ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here