శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ , ప్రధానకార్యదర్శి ఎస్పీ జీతేందర్, డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు శాలిని, డివిజన్ నాయకులు బొట్టు శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్, డివిజన్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా తదితరులు పాల్గొన్నారు.