శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ప్రజలందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ ఈద్గా, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్, భిక్షపతి నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్ లలోనిర్వహించిన ప్రార్ధనలలో ఆయన పాల్గొని ప్రజలకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అన్ని కులాలు, మతాలను సమానభావంతో చూస్తున్న సెక్యులర్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ ఈద్గాలో ప్రభుత్వం తరపున నమాజ్ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్, సయ్యద్ తహెర్, లాలూ పటేల్, ముజీబ్, నుమాన్ బీన్ సయ్యద్, ఎస్ కె యూసుఫ్, సయ్యద్ పాషా, ఎం డి యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.