శేరిలింగంపల్లి, జూన్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): బక్రీద్ పర్వదినంను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ కు చెందిన ముస్లింలు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముస్లింలకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బక్రీదు పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని అన్నారు. చాలా పవిత్రమైన పండుగ అని, మత సామరస్యానికి ప్రతీక అని , త్యాగానికి ప్రతి రూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, ప్రసాద్, రామచంద్రారెడ్డి, అనిల్, ఇస్మాయిల్, మున్నా, కైసర్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.