చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో మియాపూర్ లోని త‌న‌ క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ చెరువులను స్వచ్చందంగా దత్తత తీసుకొని CSR నిధులతో సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని, చెరువుల సుందరీకరణలో భాగంగా పటేల్ చెరువు , గంగారాం పెద్ద చెరువు ల సుందరీకరణ లో భాగంగా న్యాయ చిక్కులు ఏర్పడటంవలన కోర్ట్ పరిధిలో ఉండటం వలన సుందరీకరణ పనులకు ఆటంకం ఏర్పడింద‌ని, పనులలో జాప్యం నెలకొంద‌ని, త్వరితగతిన న్యాయ వివాదాలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. TDR వంటి అంశాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూసి పనులు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ACP నాగిరెడ్డి, TPS రాకేష్, సర్వేయర్ జగదీశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here