అలరించిన బాలాజీ శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో హ్యాండ్లూమ్ ఎక్స్ పో నిర్వహణలో భాగంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సత్య కీర్తి నృత్య ధామం గురువు బాలాజీ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
గణేశా పంచరత్నం, బ్రహ్మాంజలి, లింగాష్టకం, రాసలీల (జయ జనార్ధన), కొలువైతివా రంగ సాయి, దశావతార శబ్దం, రామాయణ శబ్దం, సరస్వతి స్తుతి, అన్నమయ్య కీర్తన, భోశంభో, ఝేమ్ ఝేమ్ తనన అంశాలపై నృత్య ప్రదర్శన చేశారు. కళాకారులు ధాత్రి, తపస్వి, సహస్ర, హర్షిత, చిన్మయి, రిషిత, అనికా, యశస్వి, జ్యోతి, కీర్తన, వినీల, కావ్య, ఖుషి, తదితర కళాకారులు కూచిపూడి నృత్యప్రదర్శనలో పాల్గొన్నారు.

అలరించిన కళాకారుల కూచిపూడి నృత్యప్రదర్శన
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here