ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉపాధ్యాయుడు న‌ర‌సింహులు గౌడ్‌కు స‌న్మానం

గ‌చ్చిబౌలి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని ఖాజాగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా సేవ‌లందించిన న‌ర‌సింహులు గౌడ్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. సోమ‌వారం పాఠ‌శాల‌లో ఆయ‌న‌కు ప‌దవీ విర‌మ‌ణ సంద‌ర్భంగా స‌న్మాన కార్యక్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి డివిజ‌న్ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజ‌రై ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన న‌ర‌సింహులు గౌడ్‌ను స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిస్ట్రిక్ట్స్ సైన్స్ ఆఫీస‌ర్ రాజా రెడ్డి, ఎంఈవో వెంక‌ట‌య్య‌, టీచింగ్ యూనియ‌న్ పీఆర్‌టీయూ అధ్యక్షుడు మ‌హేంద‌ర్ రెడ్డి, ప్ర‌ధానోపాధ్యాయుడు న‌ర‌హ‌రి, శ్యామ‌ల‌, స్కూల్ ఇన్‌చార్జి ప్ర‌మోద్‌, పాఠ‌శాల యాజ‌మాన్య క‌మిటీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడు న‌ర‌సింహులుగౌడ్‌ను స‌న్మానించి జ్ఞాపిక‌ను అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా
కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here