గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన నరసింహులు గౌడ్కు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం పాఠశాలలో ఆయనకు పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ పొందిన నరసింహులు గౌడ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్స్ సైన్స్ ఆఫీసర్ రాజా రెడ్డి, ఎంఈవో వెంకటయ్య, టీచింగ్ యూనియన్ పీఆర్టీయూ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నరహరి, శ్యామల, స్కూల్ ఇన్చార్జి ప్రమోద్, పాఠశాల యాజమాన్య కమిటీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

