శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాంనరేశ్ నగర్ కాలనీలో ఉన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కాలనీలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రాం నరేష్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజి వ్యవస్థ ను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రాం నరేష్ నగర్ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకుందాం అని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.