గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ కాలనీలో శిధిలావస్థకు చేరుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మ్యాన్హోల్స్ కు కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ సోమవారం దగ్గరుండి మరమ్మత్తులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో కొన్ని వీధుల్లో మ్యాన్ హోల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. అందువల్లే వాటికి మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కాలనీ వాసులు ఓపెన్ నాలాలు, డ్రైనేజీల్లో చెత్తను వేయకూడదని, అప్పుడే కాలనీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు రమేష్ నాయక్, పంతం వెంకటేష్, శీను, బసవయ్య, టి కుమార్ ముదిరాజ్, దశరథ్ యాదవ్, యూత్ నాయకులు లవణ చారి, చంద్రశేఖర, నరేష్, అంకమ్మరావు, సురేష్ పాల్గొన్నారు.






