బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బిక్షపతి యాదవ్ మద్దతు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నియంతృత్వ పాలనకు నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు మంగళవారం శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు మారబోయిన బిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ లు మద్దతు తెలిపారు. సంగారెడ్డి ప్రాంతంలో ‌బండి సంజయ్ ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులతో వారు కొంత దూరం పాదయాత్ర పాదయాత్ర చేశారు. పాదయాత్ర ప్రభంజనం చూస్తుంటే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు ఉవ్విలూరుతున్నారని భిక్షపతియాదవ్ పేర్కొన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ను కలిసిన‌ బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ పక్కన ఎమ్మెల్యే రఘునందన్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here