గణేష్ ఉత్సవాలపై సైబరాబాద్ కమిషనరేట్ లో సమీక్ష

  • భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ గా జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ గా జ్ఞానేంద్ర ప్రసాద్ ను నియమించారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గం లోని అన్ని వినాయక మండపాలు, నిమజ్జనం ప్రాంతాల్లో వీదిదీపాలు, కరెంటు వైర్లు, డ్రైనేజీలు, చెరువుల శుభ్రత, ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలున్నా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు తెలపాలని కోరారు. అన్ని డివిజన్లలో కన్వీనర్లు, కో కన్వీనర్లు కమిటీలు వేసుకొని సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు రాఘవరెడ్డి, భగవంత్ రావు, రామారావు, మురారి, బద్దం మహిపాల్, రమేష్, జ్ఞానేంద్ర ప్రసాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

సమీక్ష సమావేశం లో మాట్లాడుతున్న భాగ్యనగర్ ఉత్సవ్ సమితి సెంట్రల్ కమిటీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్‌ జ్ఞానేంద్ర‌ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here