కూల్చేసిన ఎంసీపీఐయూ భవనానికి నష్టపరిహారం ఇవ్వాలి – ఎంసీపీఐయూ నాయకుల డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లిః వర్షాల పేరుతో చందానగర్ డివిజన్ పరిధి పోగుల ఆగయ్య నగర్ లోని భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం సరికాదని ఎంసీపీఐయూ గ్రేటర్ కార్యదర్శి తుకారాం నాయక్, నాయకులు అనిల్ కుమార్, పల్లె మురళి, దానయ్య పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల పేరుతో శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేయాలని ప్రభుత్వ అధికారులు ఎంసీపీఐయూ కార్యాలయం భవనాన్ని కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యాలయాన్ని కూల్చేముందు పార్టీ నాయకులకు కనీస సమాచారం ఇవ్వకుండా కూల్చి వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం కార్యాలయం పైకప్పు రేకు పగిలి ఉన్నంత మాత్రాన శిథిలావస్థలో ఉందని భవనాన్ని కూల్చివేయడం శోచనీయం అన్నారు. పీఏ‌ నగర్ లోని ఓంకార్ భవన్ ను కూల్చి వేసినందుకు నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పీఏ నగర్ లో కూల్చివేసిన ఎంసీపీఐయూ కార్యాలయం శిథిలాలను పరిశీలిస్తున్న ఎంసీపీఐయూ నాయకులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here