శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల లో 470 మార్కులు సాధించి, మల్టి జోన్ 2 లో 123 వ ర్యాంక్ సాధించి గ్రూప్ 1 కు ఎంపికైన మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ కాలనీకి చెందిన కోలపల్లి ప్రసాద్ కుమార్తె కోలపల్లి దీపికా రత్నని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికై న కోలపల్లి దీపికా రత్న ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని అన్నారు. గ్రూప్1 సాధించడం చాలా గొప్ప విషయం అని , ఎంతో మందికి కలల ఉద్యోగం అని, రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఉద్యోగం అని అన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోలపల్లి దీపికా రత్న తండ్రి కోలపల్లి ప్రసాద్, మంత్రిప్రగడ సత్యనారాయణ, గోలి శ్రీనివాస్ నాయుడు, కొండల్ రావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.