కేటీఆర్ కి శ్రీవారి ప్రసాదం అందజేసిన రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శేరిలింగంపల్లి యువనేత, భారాస సీనియర్ లీడర్ రవీందర్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ వచ్చిన అనంతరం కేటీఆర్ ను ఆయన నివాసంలో కలిసి మంగళవారం అందజేసినట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రవీందర్ యాదవ్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. శేరిలింగంపల్లిలోని తాజా రాజకీయాలు, పార్టీ కార్యకర్తలకు సంబంధించి రవీందర్ యాదవ్ ను అడిగారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై శేరిలింగంపల్లిలో బలంగా పోరాడుతున్నట్లుగా రవీందర్ యాదవ్ కేటీఆర్ కు వివరించారు. స్థానిక సమస్యలపై నిత్యం ప్రశ్నిస్తూ జనం పక్షాన పోరాటం చేస్తున్నామన్నారు. అంతేకాదు పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్తున్నట్లుగా వివరించారు. రవీందర్ యాదవ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మరింత ముందుకు దూసుకువెళ్లాలని కేటీఆర్ సూచించారు. అనంతరం రవీందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు చేస్తుందన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ను అంతర్జాతయ స్థాయిలో పెంచడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందన్నారు. కేసీఆర్ పాలనలోనే స్వర్ణయుగం సాగిందని రవీందర్ యాదవ్ కొనియాడారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here