సమస్యలు పరిష్కరించాలని జోనల్ క‌మిష‌న‌ర్‌కు కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి వినతి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధికి నిధులు కేటాయించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం‌ జడ్ సీ కార్యాలయంలో జడ్ సీ రవికిరణ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, గోపనపల్లి తండా, ఎన్టీఆర్ నగర్, కేశవ నగర్ , నేతాజీ నగర్, రాయదుర్గం, మంజీర డైమండ్ టవర్ లో డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ వెంకన్న ను కలిసి సమస్యల పై చర్చించారు. కార్యక్రమంలో గోపనపల్లి వడ్డెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు ప్రకాష్ ఉన్నారు.

జడ్ సీ కి వినతి పత్రం అందజేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here