డ్రైనేజీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, జూన్ 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్సీఐ కాలనీ ప్రగతి ఎనక్లేవ్, మియాపూర్ విలేజ్ లలో ఉన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జలమండలి అధికారులు జిఏం నారాయణ, డీజిఏం అమీరుద్దీన్, స్థానిక నాయకులు కాలనీ వాసులతో కలసి కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిశీలించడం జరిగింద‌ని, కాలనీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని అన్నారు. పొంగుతున్న మ్యాన్ హోల్ ల వద్ద పునరుద్ధరణ చేస్తామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని అన్నారు. కాలనీల వాసులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ సునీత, వాటర్ వర్క్స్ వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, సూపర్వైజర్ లింగయ్య, హర్షద్, మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుప్రజ, స్థానిక నాయకులు ఉమాకిషన్, రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస్, పాండు, రాంబాబు, ఉమమహేశ్వర్ రావు, శ్రీనివాస్, శివకుమార్, ఏబీఎన్ మూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here