శేరిలింగంపల్లి, మే 13 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సిద్దిక్ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని , ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు త్వరలోనే పూర్తి చేస్తానని, మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని, కాలనీ అసోసియేషన్ భాగస్వామ్యంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిక్ నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, జనరల్ సెక్రెటరీ రవీందర్ రెడ్డి, ట్రెజరర్ విష్ణు వర్ధన్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.