చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌, పున‌రుజ్జీవ‌నానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మార్చి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని చెరువుల అభివృద్ధికి PAC ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో CSR నిధులతో ది లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథమ్ చెరువు, పటేల్ చెరువు, పెద్దకుడి చెరువు, రామసముద్రం కుంట, నాయనమ్మ కుంట చెరువుల సుందరీకరణలో భాగంగా స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను, చెరువుల ఇన్లెట్ అవుట్లెట్ ప్రాంతాలను మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాధం చెరువు తరహా మిగతా చెరువుల పునరుద్ధరణ తో దశ దిశ మారునని అన్నారు. చెరువులను సుజల జలంతో అపురూప దృశ్యకావ్యంగా ఆవిష్కృతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామ‌న్నారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో CSR నిధులతో, ది లేక్ లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథమ్ చెరువు,నాయనమ్మ కుంట, రామసముద్రం కుంట, పటేల్ చెరువు, పెద్దకుడి చెరువు, మిదికుంట చెరువుల సుందరీకరణలో భాగంగా స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను త్వరలో చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిగవాడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆనంద్ మల్లిగవాడ్, సభ్యులు రామ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here