శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆరంభ టౌన్షిప్ లో దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజులపాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు బతుకమ్మ సంబరాలను కూడా నిర్వహించనున్నారు. చుట్టుపక్కల భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోమాల విజయ లక్ష్మణ్, దాసరి సరిత, అరుణ శ్రీ, లక్ష్మయ్య, నాగరాజు , జనార్ధన్, విక్రమ్ యాదవ్, పూజ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.