శేరిలింగంపల్లి, జూన్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన GHMC 11వ సర్వసభ్య సమావేశంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి చందానగర్ డివిజన్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, ప్రధాన సమస్యలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వెంటనే పనులు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.