శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా ఇద్దరు లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన 1,20,000 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ చౌదరి, కాశినాథ్ యాదవ్, తిరుపతి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.