శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ కి చెందిన మాలకొండయ్య అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన 2,50,000 రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన CMRF – LOC మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, గురు చరణ్ దూబె, చంద్రిక ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.