శేరిలింగంపల్లి, మే 13 (నమస్తే శేరిలింగంపల్లి): తాజాగా విడుదలైన CBSE పదవ తరగతి ఫలితాలలో కానరి ద స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. 500 మార్కులకు గాను 490 (98%)మార్కులతో నిశాంత్ పారుపల్లి అనే విద్యార్థి ప్రథమ స్థానాన్ని సాధించగా, 420కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఏడు మంది ఉన్నారు. ఈ సంవత్సరం సబ్జెక్టుల వారీగా ICTలో 100 మార్కులతో తెలుగులో 99మార్కులతో, హిందీలో 98మార్కులతో, ఆంగ్లంలో 97మార్కులతో , గణితంలో 95 మార్కులతో , సైన్స్లో 98మార్కులతో, సోషల్ 99 మార్కులతో కానరి విద్యార్థులు A1 గ్రేడ్లను సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ ఫలితాలు కానరి ద స్కూల్ క్రమశిక్షణ, సమయపాలన, కచ్చితమైన విద్యావిధానాల అమలుకి నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రిన్సిపల్ లిడియా క్రిస్టినా పేర్కొన్నారు.

ఈ విజయాన్ని పురస్కరించుకొని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా, హెడ్ సీనియర్ స్కూల్ నవీన్ కుమార్ ఇమ్మడి, అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థుల విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తమ విద్యా విధానం ద్వారా, విద్యార్ధులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్నేహ పూర్వక వాతావరణాన్ని కల్పిస్తూ, వారిని బహుముఖంగా, అగ్రగాములుగా తీర్చి దిద్దడంలో కానరి ముందంజలో ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి, చైర్మన్ శ్వేతారెడ్డి తెలిపారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో తమ విద్యార్థులు విశ్వస్థాయిలో ప్రతిభను కనబరచడానికి పునాది కానున్నాయని తెలిపారు.