బాలాజీ నిర్మాణ‌ సంస్థ సేవ‌లు అభినందనీయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హుడా కాలనీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ది పనులకు 50 వేల రూపాయలను వితరణ చేసిన బాలాజీ నిర్మాణ‌ సంస్థ సేవ‌లు అభినందనీయం అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బాలాజీ నిర్మాణ సంస్థ నూతన నిర్మాణ ప్రాజెక్ట్ బ్రోచర్ ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్క‌రించారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ది పనులకు 50 వేల రూపాయలను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీచేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు బాలాజీ నిర్మాణ సంస్థ అందచేసింది. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ బాలాజీ సంస్థ నూతన నిర్మాణ ప్రాజెక్ట్ బ్రోచర్ ను విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, బాలాజీ సంస్థ ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధి పనులకు 50 వేల రూపాయలను వితరణగా ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బాలాజీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొండా విజయ్ కుమార్, డైరెక్టర్ సంతోష్ , మనోహర్ గౌడ్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here