అహ్మదాబాద్ విమాన ప్ర‌మాద మృతుల‌కు జగదీశ్వర్ గౌడ్ సంతాపం

శేరిలింగంప‌ల్లి, జూన్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదకరమ‌ని, మృతుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాన‌ని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, స్టాండింగ్ కమిటీ మెంబ‌ర్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుంటూ మౌనం పాటించి నివాళులు అర్పించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.బాధిత కుటుంబాలకు ఆ భ‌గ‌వంతుడు ధైర్యాన్ని ఇవ్వాల‌ని ప్రార్ధిస్తున్నాము అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here