నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ జయంతిని అసోసియేషన్ హాల్ లో నిర్వహించారు. అనంతరం అంబెడ్కర్ కు ఘన నివాళి అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ చూపించిన బాటలో అడుగులేద్దామని జనరల్ సెక్రెటరీ తాండ్ర రమేష్ తెలిపారు. కార్యక్రమంలో కూకట్ పల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డి.మల్లేశ్, జనరల్ సెక్రటరీ తాండ్ర రమేశ్ గౌడ్, జాయింట్ సెక్రటరీ హరీశ్ శంకర్ రెడ్డి, ట్రెజరర్ డి.రాజు, లైబ్రరీ సెక్రటరీ హర్షవర్ధన్ రెడ్డి, స్పోర్ట్ అండ్ కల్చరల్ సెక్రటరీ పి.మధుసూదన్ , లేడీ సెక్రటరీ జి.శ్రీలత, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కె.శివకృష్ణ, జి. జ్యోత్స్న, జి.చంద్రశేఖర్, వి.శ్వేతకుమారి, కె.గోపాల్ రెడ్డి, రక్తపు శేేఖర్ గౌడ్, ఎస్.బాలాపీర్, పి.విజయ్ కుమార్, బి.నరేష్ కుమార్ పాల్గొన్నారు.