డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి

  • లహరి హోమ్స్ , ఆడి ఏమరోల్డ్ అపార్ట్ మెంట్ సొసైటీ వాసుల ఆవేదన

నమస్తే శేరిలింగంపల్లి: వర్షం పడిందంటే చాలు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, జిహెచ్ ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండలోని లహరి హోమ్స్ , ఆడి ఏమరోల్డ్ అపార్ట్ మెంట్ సొసైటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు, మురుగు నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోవటం వల్ల ఆ నీటిలో మునిగి తమ వాహనాలు చెడిపోతున్నాయని రాష్ట్ర యువమోర్చ కోశాధికారి రఘునాథ్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు ఆయా కాలనీవాసులు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పుట్టలయ్య, కార్యదర్శి క్రాంతి, శ్రీనివాస్, బీజేపీ డివిజన్ కార్యదర్శి కరణ్ గౌడ్, యువమోర్చ అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్, సొసైటీ పెద్దలు పాల్గొన్నారు.

డ్రైనేజీ సమస్య గురించి రాష్ట్ర యువమోర్చ కోశాధికారి రఘునాథ్ యాదవ్ తో చర్చిస్తున్న లహరి హోమ్స్ , ఆడి ఏమరోల్డ్ అపార్ట్ మెంట్ సొసైటీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here