క్రిస్మస్ కానుకల పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని సత్యాలక్ష్మి నగర్ కాలనీలోని “చర్చ్ ఆఫ్ క్రిస్ట్ చర్చి లో” క్రిస్టమస్ వేడుకల సందర్భంగా సెమి క్రిస్టమస్ నిర్వహించారు. అనంతరం మియాపూర్ డివిజన్ బీ ఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి క్రిస్టియన్ సోదరి సోదరమణులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ బట్టలు పంపిణి చేశారు.

చర్చ్ ఆఫ్ క్రిస్ట్ చర్చిలో క్రిస్టియన్ సోదరి సోదరమణులకు బట్టలు పంపిణి చేస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని సత్యాలక్ష్మి నగర్ కాలనీలోని చర్చ్ ఆఫ్ క్రిస్ట్ చర్చిలో జరిగిన సెమి క్రిస్టమస్ వేడుకలలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు అర్హులైన పేద క్రిస్టియన్లకు నూతన క్రిస్మస్ బట్టలను పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్ వందన్ కుమార్, సల్మాన్ రాజు, బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాధర్, చంద్రిక, రోజా, గోపరాజు శ్రీనివాస్, అశోక్, జంగిర్, సుప్రజ, క్రిస్టియన్ సోదరి సోదరమణులు పాల్గొన్నారు.

క్రిస్మస్ కానుకలు పొందిన వారితో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here