నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సుదేష్ కుమార్ నివాసంలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్టమస్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణలతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండల్ రెడ్డి, తాహిర్, సబీర్, జమీర్, సల్మాన్, మనోహర్, బెంజు, మోన, సలీమ్, గౌస్, అలీం పాస్టర్ రమేష్, క్రిస్టియన్ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-26-at-2.53.40-AM.jpeg)