బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సుదేష్ కుమార్ నివాసంలో క్రిస్మస్ వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సుదేష్ కుమార్ నివాసంలో క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్టమస్ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణలతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండల్ రెడ్డి, తాహిర్, సబీర్, జమీర్, సల్మాన్, మనోహర్, బెంజు, మోన, సలీమ్, గౌస్, అలీం పాస్టర్ రమేష్, క్రిస్టియన్ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సుదేష్ కుమార్ నివాసంలో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here