కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా.. చంద్రమోహన్ విస్తృత ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి : బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా గోపీ నగర్, నెహ్రూనగర్ లలో బూత్ నెం.85, 86, 87లో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చంద్రమోహన్ విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు చంద్రమోహన్ 

అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలవనుందని, అందులో చేవెళ్ల ఒకటని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముస్లిం, మైనార్టీ వర్గాల్లోని విద్యావంతులు, మహిళలు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్, నర్సింహ, చంద్ర, విట్టల్, జగయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here