ఏప్రిల్ 5న మహా ర్యాలీని జయప్రదం చేయండి

  • కిసాన్ మజ్దూర్ సంఘర్ష ర్యాలీని ప్రారంభించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు 

 నమస్తే శేరిలింగంపల్లి:  సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే మహా ర్యాలీని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై చేపట్టే ర్యాలీకి అనుబంధంగా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ లేబర్ అడ్డా నుండి మద్దూర్, కిసాన్ సంఘర్ష యాత్రను ప్రారంభించారు.

చందానగర్ లేబర్ అడ్డా నుండి మద్దూర్, కిసాన్ సంఘర్ష యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్న దృశ్యం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేటర్ మతోన్మాద అనుకూల విధానాలపై కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజలకు చైతన్యం కల్పించేందుకు ఈ యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్మిక వాడలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఈఎస్ఐ పిఎఫ్ తదితర సౌకర్యాలను రోజురోజు తగ్గించడం పట్ల కార్మిక జీవితాల  మరింత దిగజారుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా నాయకులు చంద్రమోహన్, రుద్ర కుమార్ శేరిలింగంపల్లి నాయకులు శోభన్, కృష్ణ, సంతోష్, లెనిన్ పాల్గొన్నారు. 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here