అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా “కంటి వెలుగు” : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్నదని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు, డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్స్, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, ఏరియా కమిటీ మెంబర్స్, బూత్ కమిటీ మెంబర్స్, బీఆర్ఎస్ శ్రేయోభిలాషులు ఉత్సాహంగా పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరారు.

కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here