కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ చెక్కులు పంపిణి

  • 25 మంది లబ్దిదారులకు రూ. 2లక్షల 2వేల 900 మంజూరు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్ పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం కింద 25 లక్షల 2 వేల 900ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయాన్ని చెక్కులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తన నివాసంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని తెలిపారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, కాశినాథ్ యాదవ్, ఎల్లం నాయుడు, చంద్రమోహన్ సాగర్ తెరాస నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here