కోలాహలంగా కళింగ వనభోజన మహోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ జీడిమెట్ల HMT ground లో కళింగ వనభోజన మహోత్సవ కార్యక్రమం కళింగ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి శ్రీరామచంద్ర మూర్తి, కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, ఢిల్లీశ్వర రావు ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, మాజీ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ జి యతిరాజులు, ఉత్తరాంధ్ర పార్టీ కన్వీనర్ మెట్ట రామారావు (IRS), జాతీయ కళింగ సంఘం అద్యక్షుడు డాక్టర్ పి సూర్యం, కుత్బుల్లాపూర్ మాజీ శాసన సభ్యుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ హాజరయ్యారని బొడ్డేపల్లి కళింగ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ చంద్ర మూర్తి తెలిపారు.

వనభోజన మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, మాజీ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ జి యతిరాజులు తదితరులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here