సాయిబాబా దేవాలయంలో అభిషేకం

  • ప్రత్యేక పూజలు చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్ సాయిబాబా దేవాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా… ఆలయ పూజారులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన అభిషేకం ప్రత్యేక పూజల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ శివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దినేష్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కాలనీ వాసులు, స్థానిక నేతలు, భక్తులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రత్యేక పూజల అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్న ఆలయ పూజారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here