మాధవనగర్ లో.. జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర, ఇంటింటి ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: జగద్గిరిగుట్టలోని మాధవ నగర్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎంఎల్ఏ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు.

పూలు చల్లుతూ మంగళహారతులు పట్టి స్వాగతం పలుకుతున్న మహిళా మణులు

ఈ సందర్భంగా మహిళలు ఆయనకు  మంగళ హారతులు పట్టి, గులాబీ పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇంటింటి ప్రచారం కొనసాగించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన ఆశీర్వాదం పొందుతూ..

హస్తం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వ దృష్టి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here