నిరుపేదలకు అండగా ఉంటాం

  • గుడిసెల తొలగింపు పై జెర్రిపేటి జైపాల్ ఆగ్రహం
మియాపూర్ స్టాలిన్ నగర్ లో గుడిసెలు తొలగించిన ప్రాంతంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెర్రిపేటి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ స్టాలిన్ నగర్ లో నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెలను తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెర్రిపేటి జైపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణం అన్నారు. కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములు బడా బాబులు ఆక్రమిస్తుంటే పట్టించుకోని అధికారులు నిరుపేదల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. నివాసం కోల్పోయిన నిరుపేదలందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు చలికాలం కావడంతో నిరుపేదలు ఇబ్బందులు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలను ఆదేశించారు నివాసం కోల్పోయిన బాధితులకు భోజనం ఇతర వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ శేఖర్, జహంగీర్, తిరుపతి, హన్మంతు, కవిరాజ్ పాల్గొన్నారు.

సమస్య పరిస్థిని తెలుసుకుంటున్న జెర్రిపేటి జైపాల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here